ఏపీలోని అనంతపురం టీడీపీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు శుక్రవారం లోక్ సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు కూడా హాజరు కాను అని ఆయన తేల్చి చెప్పారు.
ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఉండి ఈ వివాదానికి జీవోతో ముగింపు పలికారు.దీంతో మొంకుపట్టుకోని కూర్చున్న ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తన పంతం నెగ్గించుకున్నాట్లైంది.
ఈ క్రమంలో అనంతపురంలో రహదారుల విస్తరణకు రూ. 45 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.సీఎం చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఒక్క జీవోతో సమస్యకు తాత్కాలికంగా ముగింపు పలికినట్లైంది. చూడాలి మరి జేసీ ఏవిధంగా స్పందిస్తారో..!