హవ్వా.. హవ్వా.. వీరు మన ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..! అంటూ టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, నెటిజన్లు టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై చ్ఛి.. చ్ఛీ.. అనేంతలా స్పందించడానికి కారణం లేకపోలేదు మరీ. ఇంతకీ టీడీపీ ఎంపీలు అంతలా ఏం చేశారనేగా మీ డౌట్..? ఈ ప్రశ్నకు నెటిజన్లే సమాధానం చెబుతున్నారు. వారు చెబుతున్న సమాధానం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఇక అసలు విషయానికొస్తే, శుక్రవారం నాడు లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై వాడీవేడీ చర్చ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక హోదాపై లోక్సభలో చర్చ కొనసాగుతున్నంతసేపు టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తప్పుబట్టారు. ముఖ్యంగా టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్రెడ్డి, నరమల్లి శివప్రసాద్, మాల్యాద్రి శ్రీరామ్ ల వ్యవహార శైలిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఫైరయ్యారు. జేసీ దివాకర్రెడ్డి లోక్సభలో ఏపీకి ప్రత్యేక మోదాపై చర్చ జరుగుతున్న ఆద్యాంతం.. ఒళ్లు విరుస్తూ.. చేతులు తలపై పెట్టుకుని నిద్రపోతూ ఉండగా, శివప్రసాద్, మాల్యాద్రి శ్రీరామ్ ఒకరిపై మరొకరు పంచ్లు వేసుకుంటూ లోక్సభను కాస్త.. జబర్దస్త్ షోగా మార్చేశారు. వీరిద్దరి వ్యవహార శైలిని గమనించిన లోక్సభ స్పీకర్.. మరోసారి అలా వ్యవహరిస్తే.. పార్లమెంట్ సిబ్బంది చేత బయటకు గెంటేయిస్తాననేలా హెచ్చరికలు జారీ చేశారు.