తెలంగాణ రాష్ట్ర ఐటీ,పంచాయితీరాజ్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరబాద్ లోని జూబ్లిహిల్ల్స్ నియోజక వర్గంలోని స్టేట్ హోమ్ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి,జూబ్లిహిల్స్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గోని మొక్కలు నాటారు..
అనంతరం అనాధ బాలబాలికలు పండ్లు మరియు పుస్తకాలు పంపిణి చేశారు.ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ యువనేత మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.. భవిష్యత్తు తరాల ఆశకిరణం మంత్రి కేటీఆర్ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు మాగంటి గోపినాథ్ మరియు డివిజన్ అద్యక్షులు, మరియు నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…