వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించే ధైర్యం బీజేపీ పార్టీలో ఎవరికైనా ఉందా..? మరి ఇంతకీ టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టించేంత సవాల్ విజయసాయిరెడ్డి ఏం విసిరారు..? టీడీపీ నేతలు చెప్పినట్టు ఏపీకి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమీ లేవని, అందలోనూ 14వ ఆర్థిక సంఘం తన నివేదికలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా పేర్కొనలేదని చూపిస్తే తాను ఇప్పుడే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టీడీపీ నేతలు చెప్పిన విధంగా ఒక్క మాటచూపించండి, నేను ఇక్కడనుంచే రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ నంటూ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.
ఏపీ టీడీపీ నేతలు ఎవరైనా ధైర్యవంతులు ఉంటే.. వారు 14 ఆర్థిక సంఘం నివేదికలు తీసుకుని విజయసాయిరెడ్డి వద్దకు వెళ్లి ఆయన నుంచి రాజీనామా పత్రాన్ని స్వీకరించ వచ్చు. ఎవరికి ఉన్నాయి ఆ గట్స్..?