Home / Uncategorized / రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు తానే స్వయంగా ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని విడమరిచి చెప్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సంపూర్ణ ఫలితం స్థానికులకే దక్కాలంటే రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ వుండి తీరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుండి సత్వర ఆమోదం సాధించి, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం కొత్త నియామకాలు చేయాలని ముఖ్యమంత్రి గట్టి నిర్ణయంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకే 95శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే తెలంగాణ యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని ముఖ్యమంత్రి అభిప్రాయం. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విడమర్చి చెప్పాలని ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు.

ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ జోనల్ విధానానికి ఆమోదం తెలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వ న్యాయ శాఖ, హోం శాఖ కూడా సానుకూలంగా స్పందించాయి. ఫైల్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. జోనల్ వ్యవస్థ ఆమోదం అంశం కీలక దశలో ఉన్నందున తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ప్రధాన్యం కల్పించడానికి ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటినుంచీ భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థలో మార్పుచేర్పులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్థానికులకే ఎక్కువ అవకాశాలు వచ్చేలా కోత్త జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat