అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో విసిగిచెందిన ఆయన ఇప్పుడు మరల సొంత గూటికి చేరాలని తహతహలాడుతున్నాడు. ఇంతకు ఎవరతను అని ఆలోచిస్తున్నారా..
అతనే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి.. గత కొంత కాలంగా పార్టీలో ఎదురవుతున్న తీవ్ర అవమానాలతో ఆయన పార్టీ కార్యక్రమాలకు,అధికారక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వస్తున్నారు ఆయన. తాజాగా ఆయన ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు..ఈ భేటీలో తనకు పార్టీ మారిన దగ్గర నుండి ఎదురవుతున్న అవమానాల గురించి సవివరంగా విడమరిచి చెప్పారు .
అయితే కథ మొత్తం విని చిన్నబాబు తన పార్టీ నేతలనే వెనకెసుకొని వచ్చారు . అంతే కాకుండా పార్టీ మారిన నేతలకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అలాంటప్పుడు మనమే సర్ధుకోవాలి అని ఉచిత సలహా ఇచ్చి మరి తీవ్రంగా అవమానించాడు అంట. దీంతో తీవ్ర అవమానానికి గురైన సదరు మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరాలని ఆయన ఆలోచిస్తున్నారు అని గుర్నాథరెడ్డి అనుచరులు గుసగుసలాడుతున్నారు.. ఇల్లు కాలిపొతుందని నీళ్ళు పోయమని చిన్నబాబు దగ్గరకు వెళ్తే నీళ్ళు పోయకుండా ఇంకా మంట ఎక్కువగా పెట్టాడు అన్నమాట..