డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం చెన్నైలోని కావేరి హాస్పిటల్లో అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కరుణానిధి అభిమానులు అయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్లోని అన్నా స్కేర్ వద్ద కలైంజర్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.అయితే అంతకంటే ముందు అయన పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడినుంచి కరుణానిధి భౌతిక కాయం ఉంచిన రాజాజీ హాల్ కు చేరుకున్నారు. కరుణానిధి పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కరుణానిధి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్ పిడికిలి పైకెత్తి కరుణానిధి అమర్రహే అని నినదించారు. దీంతో అక్కడున్న కొందరు కరుణానిధి అమర్ రహే అని గొంతు కలిపారు. అనతరం కరుణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ ను డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ ఎంకే స్టాలిన్ తోడ్కొని వెళ్లారు.ఎంపీ కవిత, మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.కేసీఆర్ కంటే ముందు ప్రధాని మోడీ పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
Tags CM KCR karuna nidhi Modi
Related Articles
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
November 22, 2022
సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు
March 24, 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
March 7, 2022
తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
February 19, 2022