కేంద్ర రైల్వేమంత్రి కార్యాలయంలో విశాఖ రైల్వే జోన్ పై జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాల్లా ప్రవర్తించారు.. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పైనా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సమక్షంలోనే జరిగింది. దీనిపై పీయూష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని, ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని పీయూష్ స్పష్టం చేశారు. జోన్ కు కేంద్రం సిద్దంగా ఉందని తెలిసి, విశాఖకు రైల్వే జోన్ వస్తుందని తెలిసీ, ఒక అప్పుడు “జోను లేదు … గీను లేదు….” అంటూ వ్యాఖ్యానించిన వారే, నేడు జోన్ మేమే సాధించాం అని చెప్పుకోవడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని బీజేపీ విమర్శింస్తోంది. ఇటువంటి దౌర్జన్యాలు, దబాయింపు ద్వారా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చెయ్యొద్దని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ టీడీపీని తీవ్రంగా హెచ్చరిస్తోంది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధాటిని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండాల్ల ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ గుండాయిజం మీరు చేస్తే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే పరిస్థితి వస్తుందని బీజేపీ హెచ్చరిస్తోంది. ఏపీలో జీవీఎల్పై బహిరంగ హెచ్చరికలు చేస్తూ దౌర్జన్యాన్ని చాటుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరగనియమని బెదిరిస్తున్నారు. ఈ నేపధ్యంలో తక్షణమే జీవీఎల్ నరసింహారావుకు మరింత భద్రత కల్పించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ డిజిపికి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.