వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన పలువురు హీరోలతోపాటు, ప్రముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్, నిఖిల్, మంచు ఫ్యామిలీ, ప్రముఖ నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్, కృష్ణుడు, ఇలా ప్రతీ ఒక్కరూ వైఎస్ జగన్పై వారి మనసులోని అభిప్రాయాలను మీడియా సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ దివంగత దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు ఫ్యామిలీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా దాసరి కుమారులు ప్రభు, అరుణ్కుమార్, అల్లుడు రఘునాథ్బాబు వైసీపీ నేతలతో భేటి అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దాసరి ప్రభు, అరుణ్ కుమార్లు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు.
రానున్న కాలంలో ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా.. .అభివృద్ధి కావాలన్నా వైఎస్ జగన్ జగన్ నాయకత్వాన్ని మనమంతా బలపరచాలి అని చెప్పినట్టు సమాచారం.
అందులో భాగంగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మరో రెండు రోజుల్లో విశాఖ జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు కుటుంబం వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు.