Home / 18+ / చాలా రోజుల త‌రువాత ఇండియాకు ర‌కుల్‌..!

చాలా రోజుల త‌రువాత ఇండియాకు ర‌కుల్‌..!

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు దూర‌మై చాలా కాల‌మే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడ‌ర్ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఇక్క‌డ క‌నిపించ‌లేదు ఈ బ్యూటీ. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెల‌ల నుంచి క‌నిపించ‌డం లేదు ర‌కుల్‌. ఆ మ‌ధ్య ఎప్పుడో అజ‌య్ దేవ‌గ‌న్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండ‌న్ వెళ్లింది ర‌కుల్‌. అక్క‌డే నెల రోజుల‌పాటు షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్ త‌రువాత కార్తీ కోసం ఉక్రేన్ వెళ్లిపోయింది ర‌కుల్.

అయితే, ర‌కుల్ కార్తీతో ఇప్ప‌టికే ఖాకీ సినిమాలో నటించిన విష‌యం తెలిసిందే. అందులో ఇద్ద‌రి కెమిస్ట్రీ అద్దిరిపోయింది. దాంతో ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడు కార్తీ. ఈ చిత్రాన్ని రంజిత్ ర‌విశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం ఉక్రేన్‌లో జ‌రుగుతుంది.

అజ‌య్ దేవ‌గ‌న్ చిత్రం త‌రువాత నేరుగా కార్తీ సెట్‌లో అడుగు పెట్టింది ర‌కుల్‌. ఇక ఇప్పుడు త‌మ్ముడును వ‌దిలేసి.. అన్న‌తో రొమాన్స్‌కు రెడీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ర‌కుల్ ప్ర‌స్తుతం త‌మిల్‌లో సూర్య‌తో ఎన్‌జీకే చిత్రంలో న‌టిస్తుంది. సాయి ప‌ల్ల‌వి ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌. ఈ చిత్రంతోపాటు శివకార్తికేయ‌న్‌తోనూ ఓ సినిమా చేస్తోంది ర‌కుల్‌. ఇక తెలుగులో బాబి ద‌ర్శ‌క‌త్వంలో చైతు, వెంకి మ‌ల్టీ స్టార‌ర్‌లో న‌టిస్తోంది ర‌కుల్‌.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat