రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్కు దూరమై చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమా తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు ఈ బ్యూటీ. కేవలం టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెలల నుంచి కనిపించడం లేదు రకుల్. ఆ మధ్య ఎప్పుడో అజయ్ దేవగన్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండన్ వెళ్లింది రకుల్. అక్కడే నెల రోజులపాటు షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్ తరువాత కార్తీ కోసం ఉక్రేన్ వెళ్లిపోయింది రకుల్.
అయితే, రకుల్ కార్తీతో ఇప్పటికే ఖాకీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో ఇద్దరి కెమిస్ట్రీ అద్దిరిపోయింది. దాంతో రకుల్ ప్రీత్ సింగ్కు మరో ఛాన్స్ ఇచ్చాడు కార్తీ. ఈ చిత్రాన్ని రంజిత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఉక్రేన్లో జరుగుతుంది.
అజయ్ దేవగన్ చిత్రం తరువాత నేరుగా కార్తీ సెట్లో అడుగు పెట్టింది రకుల్. ఇక ఇప్పుడు తమ్ముడును వదిలేసి.. అన్నతో రొమాన్స్కు రెడీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రస్తుతం తమిల్లో సూర్యతో ఎన్జీకే చిత్రంలో నటిస్తుంది. సాయి పల్లవి ఈ చిత్రంలో మరో హీరోయిన్. ఈ చిత్రంతోపాటు శివకార్తికేయన్తోనూ ఓ సినిమా చేస్తోంది రకుల్. ఇక తెలుగులో బాబి దర్శకత్వంలో చైతు, వెంకి మల్టీ స్టారర్లో నటిస్తోంది రకుల్.