ఎస్వీ మెడికల్ లో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న పుట్లూరు గీతిక తిరుపతి శివజ్యోతినగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యువతి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తుండగాజజ పోలీసుల చేతికి మెడికో గీతిక సూసైడ్ నోట్ దొరికింది. గీతిక ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా గీతిక, తన తల్లి హరితా దేవికి ఇటీవల ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
మనస్తాపం చెందిన గీతిక, పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిరికి దానిని కాదని..తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకుండా ఉండలేనని, జీవితంలో ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదని, తనను క్షమించాలని పేర్కొంది.