రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలతో టీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యం అని… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో మొత్తం 9 తీర్మానాలకు ఆమోదం తెలిపాం అని అన్నారు. మేం తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని కేంద్రానికి కోరతామని చెప్పారు.
“రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ టీఆర్ఎస్ కు పొత్తు ఉండబోదు. ఒకేసారి రుణమాఫీ సాధ్యం కాదు.రాష్ట్ర ఆదాయం బట్టే ఖర్చులు, పథకాలు ఉంటాయి. అన్ని పథకాలకు కేటాయింపులు రద్దు చేస్తేనే ఒకేసారి రుణమాఫీ సాధ్యం. నిరుద్యోగ భృతి అనేది సాధ్యం కాదు. ఎవరు నిరుద్యోగులు, ఎంతమంది ఉన్నారు అనేది ఎలా నిర్ణయిస్తారు?
నీతీశ్ కుమార్ అడిగినందుకే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీఏకు మద్దతిచ్చాం. నీతీశ్ కుమార్ నాకు మంచి మిత్రుడు. ఆయన మాత్రమే మా మద్దతు అడిగారు. ఫెడరల్ ఫ్రంట్ కచ్చితంగా ఏర్పడి తీరుతుంది.మా పొట్టకొట్టిన వాళ్లతోనే మా పోరాటం. పొట్టకూటి కోసం వచ్చిన వారితో కాదని ఎప్పుడో చెప్పా. ఇక్కడ ఉన్నవారంతా ఈ రాష్ట్రప్రజలే “అని కేసీఆర్ అన్నారు.