రామ్ చరణ్ అంటేనే కేరాఫ్ రొటీన్ సినిమా అనే ముద్ర పడిపోయింది. ఈ మధ్య దాన్ని తొలగించుకునే పనిలో ఉన్నాడు ఈ మెగా హీరో. తన కెరీర్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు చరణ్. అందులో భాగంగానే, 4ధృవ చిత్రం నుంచి కొత్త దారిలో వెళుతున్నాడు. రంగస్థలం చిత్రంతో తన లోని నటుడ్ని సనీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ ఒక్క చిత్రంతోనే తనపై పదేళ్ల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేశాడు. ఇప్పుడు బోయపాటి చిత్రంతో బిజీ.. బిజీగా ఉన్నాడు.
రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. ప్రస్తుతం బ్రేక్లో ఉన్న చరణ్.. న్యూయార్క్లో ఉన్నాడు. వచ్చీ రాగానే మిగిలిన షూటింగ్ పార్ట్ను పూర్తి చేయనున్నాడు. ఇందులో చరణ్ సరసన, భరత్ అనే నేను ఫేమ్ కైరా జోడీ కట్టిన విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.
అయితే, బోయపాటి తరువాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటించనున్నాడు. రాజమౌళి సినిమా అంటే రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి చరణ్ నట రుద్రుడు ఎన్టీఆర్తో కలిసి నటించనున్నాడు. దర్శక ధీరుడు రూ.300 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంతో రామ్ చరణ్ మార్కెట్ మరింత పెరడగం ఖాయమంటూ అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. బోయపాటి, రాజమౌళితోపాటు కొరటాల శివ కూడా చరణ్ దర్శకుల లిస్టులో ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలోనే సినిమా రావాల్సి ఉన్నా కుదరలేదు. అయితే, ఎప్పటికైనా చరణ్తో సినిమా చేస్తానంటున్నాడు కొరటాల.