Home / 18+ / జ‌గ‌న్‌ను క‌లిసిన ఈ పెద్దాయ‌న ఎవ‌రో తెలుసా..?

జ‌గ‌న్‌ను క‌లిసిన ఈ పెద్దాయ‌న ఎవ‌రో తెలుసా..?

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌తో చెప్పుకునేందుకు అర్జీల‌తో ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యాల‌తో న‌లిగిపోతున్న ఎంద‌రో సామాన్యులు జ‌గ‌న్‌తో త‌మ ఆవేద‌న‌ను వెల్ల‌బుచ్చుకుంటున్నారు. జ‌గ‌న్ మాత్రం వారి స‌మ‌స్య‌ల‌ను.. విన్న‌పాల‌ను ఎంతో సహృద‌యంతో వింటూ.. వారికి ఓదార్పుతోపాటు తానున్నాన‌న్న ఒక భ‌రోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లాలో ముగించుకుని ఇవాళ విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విశాఖ జిల్లా ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలోనే, విశాఖ జిల్లాకు చెందిన ఓ పెద్దాయ‌న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై టీడీపీ ప‌న్నుతున్న కుట్ర‌ల‌ను జ‌గ‌న్‌కు వివ‌రించాడు. టీడీపీ నేత‌లు త‌మ ప్రాబ‌ల్యాన్ని పెంచుకునేందుకు.. వైసీపీపై విష ప్ర‌చారం చేయిస్తున్నార‌ని, ఆ ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌న్నారు. అంతేకాకుండా, ఇటీవ‌ల కాలంలో విశాఖ జిల్లాలో వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ బాగా పెరిగింద‌ని, ఆ క్ర‌మంలోనే వైసీపీలోకి భారీ సంఖ్య‌లో ప‌లువురు టీడీపీ శ్రేణులు చేరిన‌ట్టు జ‌గ‌న్‌కు చెప్పారు ఆ పెద్దాయ‌న‌. ఇందుకు స్పందిస్తూ వైఎస్ జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌కు ఆ పెద్దాయ‌న మొఖంలో చిరున‌వ్వు చిందించింది. ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చెప్పారంటే.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విశాఖప‌ట్నం జిల్లాలో అత్య‌ధిక శాతం ఎమ్మెల్యే సీట్ల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంటుంద‌ని, అందులో ఎటువంటి సందేహం లేద‌ని, మ‌న పార్టీ విజ‌యాన్ని ఎవ‌రూ ఆపలేరంటూ వైఎస్ జ‌గ‌న్ ఆ పెద్దాయ‌న‌కు చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat