భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వాజ్పేయి మరణం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో విషాదం నింపింది. వాజపేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు.
వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు, వాజపేయి కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషులు చాలా అరుదు. ఆయన నిస్వార్ధపరుడైన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకుంటున్నానని ఎం.మోహన్ బాబు అన్నారు. ఇంక వాజ్ పేయి మరణం దేశానికి తీరని లోటని టీడీపీ ఎంపీ తోట నరసింహం వ్యాఖ్యానించారు. దేశం ఒక గొప్ప రాజ నీతిజ్ఞుడిని, గొప్ప నేతను కోల్పోయిందన్నారు.