ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో ప్రజా సంకల్ప యాత్ర దృశ్యాలను చూస్తే.. మాట వరసకు చెప్పడం కాదు.. నిజంగానే ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు అసాధారణ స్థాయిలో పోటెత్తారు. ఇలా పోటెత్తిన అఖండ జనసముద్రాన్ని చూడగానే టీడీపీలో తీవ్ర స్థాయిలో కలకలం మొదలైనట్టు సమాచారం.
మంత్రి యనమలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనడానికి ఈ పోటెత్తిన జనమే నిదర్శనమని రాజకీయ పండితులతోపాటు టీడీపీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి.
ఇటీవల తునిలో జరిగిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన రావడాన్ని చూసి మంత్రి యనమల రామకృష్ణుడికి ఓ రేంజ్లో భయం పట్టుకుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తుని చరిత్రలో ఎప్పుడూ.. ఏ రాజకీయ నాయకుడికి రానంతగా జనం వచ్చినట్టు సాక్ష్యాత్తు ఏపీ ప్రభుత్వ ఇంటెలిజన్స్ వర్గాలే నివేదికలు ఇచ్చాయని తెలుస్తుంది. సీఎం చంద్రబాబు, మంత్రి యనమల ఈ నివేదికను చూసి గుబులు చెందుతున్నారు.
సీఎం తరువాత ఏపీ కేబినెట్లో తన మాటు చెల్లుబాటు అవుతుందని మంత్రి యనమల చెప్పుకుంటుంటారు. అలాంటి యనమలను ఆయన నియోజకవర్గంలో ప్రజలు మాత్రం మాటలు నమ్మడం లేదన్న వాస్తవం వైఎస్ జగన్ పాదయాత్రతో బట్టబయలైంది. మంత్రి యనమల చేస్తున్న అవినీతిని కూడా పూసగుచ్చినట్టు చెప్పారు వైఎస్ జగన్. మంత్రి యనమల ఏ రేంజ్లో అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలకు తెలియడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
యనమల సోదరులు తునిలో చెలరేగిపోతున్న తీరుపట్ల ఇంటెలిజెన్స్ వర్గాలు తమ నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. మరో వైపు మంత్రి యనమల తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన కాంట్రాక్టు సంస్థకు నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టులు ఇప్పించడం.. వేల కోట్ల విలువైన పనులను వియ్యంకుడు సంస్థ ద్వారా చేపడుతున్న తీరును వైఎస్ జగన్ వివరించడంతో.. మంత్రి యనమల అవినీతి భాగోతం ప్రజలకు అర్థమైంది. మంత్రి యనమల కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేక పోయారు.