దేశ రాజధాని ఢిల్లీలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి గురువారం మరణించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్పేయి మృతిపై తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ పెట్టిన ట్వీట్ పై సోషల్ మీడియాలో తీవ్య ధూమారం రేపుతున్నాయి. “భారత మాత రాజకీయాల్లోనూ, దౌత్యం,
సాహిత్యంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయనలాంటి వక్తులు మరొకరు ఉండరు. నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆశయాలను సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఒక సన్నిహితుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయి. మేము మిమ్మల్ని మిస్ అవుతాం సర్ అటల్ బిహారి వాజ్పేయి గారు” అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు. నారా
లోకేష్ చేసిన ఈ ట్వీట్ విమర్శల పాలవుతుంది. తన తండ్రిని ట్వీట్ లో మెన్షన్ చేయటంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతాపం ప్రకటించే ట్వీట్ లో కూడా మీ తండ్రి గొప్పని ప్రకటించుకోవటంలో మీ ఉద్దేశ్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుస ట్వీట్లతో లోకేష్ పై వరుస కామెంట్లతో మండి పడుతున్నారు.
India has lost one of its greatest sons whose contribution to politics, literature and diplomacy remains unmatched. The Telugu states have lost a dear friend who along with @ncbn played a key role in shaping their aspirations. We will miss you Sir #AtalBihariVaajpayee Ji
— Lokesh Nara (@naralokesh) August 16, 2018