Home / 18+ / జగన్, భారతమ్మలను చూడాలని ఉందంటూ విద్యాసాగర్ కోరిక.. రెండు కిడ్నీలు చెడిపోయి

జగన్, భారతమ్మలను చూడాలని ఉందంటూ విద్యాసాగర్ కోరిక.. రెండు కిడ్నీలు చెడిపోయి

వైసీపీ అధినేత వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డిని, ఆయన భార్య భారతమ్మను చూస్తేనే తన జన్మ ధన్యమవుతుందని అపుడే తనకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్‌ తెలిపారు. జగన్‌ దంపతులను చూడడమే తన కోరిక అని చెప్పిన నేపథ్యంలో ఆపార్టీ నాయకులు జెట్టి రాజశేఖర్‌ వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన విద్యాసాగర్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా విద్యాసాగర్‌ మాట్లాడుతూ తనకు, తన తల్లిదండ్రులకు వైయ‌స్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబమంటే ప్రాణమని ఎప్పటికైనా పెద్దాయనను కలవాలని అనుకున్నా కుదరలేదని, ఆతర్వాత జగన్‌ చూసినపుడల్లా కలవాలని, మాట్లాడాలని అనిపించినా కుదరలేదని తెలిపారు. సివిల్‌ ఇంజనీర్‌గా ఎన్నో ప్రాజెక్టుల్లో సేవలందించిన తనకు ఎక్కడా సరైన గౌరవం దక్కలేదనన్నారు. వైయ‌స్‌ కుటుంబాన్ని చూడగానే ధైర్యం వస్తుందని పేర్కొన్నారు.

అయితే, పని చేసే సమయంలోనే నా రెండు కిడ్నీలు చెడిపోగా, అల్సర్‌ కూడా వచ్చిందని ఇంతలోనే తన కూతురు కూడా చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె కూడా వైయ‌స్ జగన్‌ను చూడాలని కోరుకునేదని, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని శ్రీకాంత్‌ రెడ్డి హామీఇచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేలా సమస్య తెలుసుకునేందుకు తనను జగన్‌మోహన్‌రెడ్డి పంపించారని తెలిపారు. జగన్ రాజోళికి వచ్చేలా మాట్లాడతామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat