మరో క్రికెటర్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు . భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తునాడని సమచారం హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ ఓపెనర్ను కలిసిన ఢిల్లీ బీజేపీ నేతలు అతనికి టికెట్ ఇవ్వడంపై కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ నుంచే గంభీర్ను బరిలోకి దింపాలని బీజేపీ చూస్తున్నది. దేశానికి సంబంధించి ఏ అంశంపై అయినా స్పందించడానికి గంభీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయంలో గంభీర్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ.. గౌతమ్ ని బరిలోకి దింపడానికి సిద్ధమవుతున్నదని తెలుస్తుంది.
Tags Cricketer politics team india
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023