ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకొవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన టీడీపీ పార్టీలో చేరతారు అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని కలిశారు అని చెబుతున్నారు..