తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించడంతో అనారోగ్యం పాలైన చిన్నారిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రెయిన్ బో హాస్పిటల్ లో మంత్రి కేటీ రామారావు,కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శించారు . ఈ సందర్బంగా ఆ బాబుకు అందుతున్న వైద్యం వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెల్సుకున్నారు. మెరుగైన వైద్యం అందించి చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు .
ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పెంటా టీకాలు వేశారు అధికారులు. వీరిలో నలుగురు చిన్నాలకు ఆరోగ్యం విషమించింది. ఇంటికి తీసుకెళ్లగానే చిన్నారులు స్పృహ కోల్పోవడంతో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్ల సలహాతో వీరిని కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. ఈ నలుగురిలో బాపురెడ్డి-మాధవిల రెండు నెలల కూతురు చనిపోయింది. బొప్పాపూర్ కి చెందిన సత్యంరెడ్డి- రేఖల నెల రోజుల పాప, ఇదే గ్రామానికి చెందిన మరో చిన్నారి కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.