Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం..!!!!

వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం..!!!!

టీడీపీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఏదోక సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఇక్కడ ప్రజలకు ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా ఆ నియోజకవర్గంలో సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు.
హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభాలికి గురిచేస్తున వారిపై చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నేత నవీన్‌ నిశ్చల్‌ ఆరోపించారు. సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతల దగ్గర ఉన్న కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమన్నారు.బాలకృష్ణ ఓడిపోతాడనే భయంతోనే టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఇదే విధంగా దౌర్జన్యాలు చేసుకుంటుపోతే ఇక ఊరుకుండేది లేదని నవీన్‌ నిశ్చల్‌ చెప్పారు.అధికారంలో ఉండడంతో ఎన్ని మోసాలు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన తెలియజేసారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat