వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం చంద్రబాబునాయుడు కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పోయిన ఎన్నికల్లో పార్టీ తరపున పోటి చేసిన ముస్లిం అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదన్న విషయం అందరికి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ముస్లింలకు మంచి చేయడంతో ఇప్పుడు వైసిపిని ముస్లిం మైనారిటీలు బాగా ఆధరించారు. తెలుగుదేశంపార్టీ, బిజెపిలు పొత్తులు పెట్టుకోవటాన్ని కూడా ముస్లింలు వ్యతిరేకించారని కూడా తెలుస్తుంది.
నాలుగేళ్ళు బిజెపితో కాపురం చేసిన సమయంలో చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకురాలేదు.ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోగా మొన్న జరిగిన సభలో ముస్లిం యువకులను కొట్టించారు.ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కొత్త ఓటు బ్యాంకును వెతుక్కునే పనిలో పడ్డారు.ఈ నేపధ్యంలో ముస్లింలను ఆకట్టుకునేందుకు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. ఎప్పుడైతే బిజెపితో తెగ తెంపులు చేసుకున్నారో అప్పటి నుండి ముస్లింలను ఆదరించేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టారు. మొన్నటి నారా హమారా-టిడిపి హమారా సభ కూడా అందులో ఒకటి.ప్రజలను మాయ చేసి ఓట్లు రాబట్టుకోడానికి బాబు ఎంతకైనా తెగిస్తారు.