భారత్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ టెస్టులో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారి,అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్స్టో మళ్లీ జట్టు కీపింగ్ బాధ్యతలను అందుకున్నాడు.
ఇక భారత్ తరపున టెస్ట్ ఆడుతున్న 292వ ఆటగాడిగా విహారి గుర్తింపు పొందాడు.మరో బ్యాట్స్మన్ అవసరమని భావించిన జట్టు యాజమాన్యం మంచి ఫామ్లో ఉన్న విహారికి అవకాశం కల్పించింది. నాలుగో టెస్టులో పేలవ ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కనీసం ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది.