తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారేక్కేందుకు సిద్దం అయ్యారు.ఈ నెల 12 న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరుతునట్లు అయన స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను టీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించిన సురేష్ రెడ్డి కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఈ నెల 12 న టీఆర్ఎస్ లో చేరుతానని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు, బాల్కొండ-ఆర్మూర్ నియోజకవర్గాల అభివృద్ధిని కోరుతూ.. ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
రాజకీయ అవసరాల కంటే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన ఉద్దేశమని..ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగాలంటే.. మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి రావాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు . రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు,రైతు బీమా పథకాలు అద్బుతంగా బాగున్నాయని కితాబు ఇచ్చారు.