Home / 18+ / నాపై జరుగుతున్న దుష్ప్రచారమంతా అబద్ధం-మాజీ మంత్రి దానం

నాపై జరుగుతున్న దుష్ప్రచారమంతా అబద్ధం-మాజీ మంత్రి దానం

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్‌ ఖండించారుతనపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు..తాను ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఎక్కడా కలువలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని దానం తేల్చిచెప్పారు. తాను ఏ పదవి ఆశించకుండానే టీఆర్‌ఎస్‌లో చేరానని, పార్టీలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.

కేసీఆర్ ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దానం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని,పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తనకు ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారే 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు.ఈ జాబితాలో తన పేరు లేకపోవడంపై తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు.కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లోనూ తెరాస ఘనవిజయం సాధించి కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా పదవి చేట్టడం ఖాయమన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ రాకుండా చిత్తుగా ఓడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని దానం అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat