ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని,విద్యాసంస్థలు, పరిశ్రమలు, రోడ్లకు నిధులు.. ఇలా అన్నీ కేంద్రం ఇచ్చినవే.రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరేం చేశారో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి?’ అని సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్ విసిరారు.2014 ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు వందలాది హామీలు ఇచ్చారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుచేశారు.ఒక్కపుడు కాంగ్రెస్ను దూషించి ఇప్పుడు చేతులు కలపటం దారుణమని అన్నారు. టీడీపీ డ్రామా కంపెనీ అని, పార్టీ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో చంద్రబాబు కన్నా అవినీతిపరుడు మరొకరు లేరని,ఆపరేషన్ గరుడ అంటూ కొత్త నాటకంతో సినీనటుడు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలుపుతారని ధ్వజమెత్తారు.స్వార్ధపూర్వక రాజకీయాలతో ప్రజల మనోభావాలతో ఆడుకుంట్టున్నారని ఆయన విమర్శించారు.