భారతీయ సాంప్రదాయాల్లో అన్ని వర్గాలు జరుపుకొనే పండగలలో వినాయక చవితి ముక్యమైనది. ప్రతీ సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం రోజున ఈ పండగ జరుపుకుంటారు.ఈ పండగకు చాల విశిష్టత ఉంది….ఏ పని చేయాలన్న ముందుగా వినాయక పూజతో ప్రారంభిస్తారు.అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
కేవలం భారత్లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారువినాయకుడి ఆశీస్సులు ఉంటే అన్నింటా విజయమేనని భక్తుల నమ్మకం. పండగ రోజున మట్టితో చేసిన ప్రతిమలను ఇళ్ళల్లో, వీధుల్లో పెట్టి, రకరకాల పుష్పాలతో, పత్రితో అలంకరించి భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు.చవితి రోజున పెద్దలు, పిల్లలు, వృద్దులు ఉత్సాహంగా పాల్గొంటారు.ఈ సందర్భంగా దేశంలో చాలా చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.