తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.జగ్గారెడ్డి,రేవంత్ రెడ్డి రూపంలో హస్తానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.తాజాగా మరో నేత కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తను బెదిరింపులకు గురిచేశారనే ఆరోపణలపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, అతని సోదరుడు శ్రీనివాస్గౌడ్పై బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసారు.
గాజులరామారం దేవేందర్నగర్లో నివాసముండే టీఆర్ఎస్ కార్యకర్త మాడవత్ రమేశ్ను కూన శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్గౌడ్ ఈ నెల 8న తమ కార్యాలయానికి పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి తెచ్చారు. అతడు ఒప్పుకోకపోవడంతో ఫోన్చేసి అంతుచూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మరుసటి రోజు తన ఇంటిముందు నుంచి పాదయాత్ర నిర్వహిస్తూ తనను కులం పేరుతో ఇష్టానుసారంగా దుర్భాషలాడారని రమేశ్ తెలిపారు. తీవ్ర మనస్తాపానికి గురై జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే సోదరులపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే శ్రీశైలంను విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఇంత వరకూ కూన శ్రీశైలం స్పందించలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.