చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కేటాయింపు విషయంలో టీఆర్ఎస్ పార్టీలో తలెత్తిన వివాదానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెరదించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు సీఎం కేసీఆర్ను కలిశారు. చెన్నూరు టికెట్ ఏంపీ బాల్క సుమన్కు కేటాయించటంతో ఓదేలు అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
అయితే కేసీఆర్తో ఓదేలు సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు ఎలాంటి అన్యాయం జరగదని.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.అధినేత మాటే తనకు శిరోధార్యమని.. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఓదేలు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.