టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై మండిపడ్డారు.ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్న టీడీపీ కుట్రలపై గవర్నర్ స్పందించాలి.వారు స్పందించకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రా పోలీసులు తెలంగాణలో అడ్డా పెట్టడం అనైతిక చర్య.టీడీపీ డబ్బును పట్టుకొని పోలీసులకు అప్పజెప్తాం. బాబు ఏజెంట్లు కాంగ్రెస్లో ఉన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు చర్యలకు మా ప్రతిచర్య తీవ్రంగా ఉంటది. ఏపీ నుంచి వందల కోట్లను ఇక్కడికి దిగుమతి చేసి గోల్మాల్ చేయాలని చూస్తున్నారు. ఏపీ పోలీసులు పచ్చ పార్టీ ఏజెంట్లుగా మారారు.చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదన్నారు. ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత చంద్రబాబుదే అని బాల్క సుమన్ హెచ్చరించారు.