కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, తన రాజకీయ అవసరాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా అనుభవంలోకి వస్తున్నట్లుంది. పార్టీలో చేరే సమయంలో ఎన్నో హామీలు ఇచ్చినట్లుగా రేవంత్ టీం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్ ఖాయమైందని వా ప్రకటించడం…కాంగ్రెస్ ఊరించడం…అనంతరం దాన్ని తుంగలో తొక్కేయడం తెలిసిన సంగతే. అయితే తాజాగా మరోషాక్ ఇచ్చారు. ఆయన ఊహించని పదవి ఇచ్చి ట్విస్ట్ ఇచ్చారు.
పార్టీలో చేరిన తొలినుంచి కూడా పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని రేవంత్ రెడ్డి కోరుతూ వచ్చారు. తనకు ఆ పదవి ఖాయమని చెప్పుకొంటున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు ఆయనకు షాకిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో అధిష్టానం సరిపెట్టింది. రేవంత్కు ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తే వన్ మెన్ షోల మాదిరిగా మారుస్తాడంటూ సీనియర్లు రేవంత్ కు రాకుండా అడ్డుకట్ట వేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, గతంలో రేవంత్ పాదయాత్రకు సైతం నో చెప్పిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పాదయాత్రలు వద్దని అధినేత రాహుల్గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దానికి కొనసాగింపుగా తాజా పదవి నేరుగా రేవంత్కు ఇచ్చిన తాజా షాక్ అని అంటున్నారు.