Home / 18+ / వైఎస్ జగన్ యాత్ర @3000….

వైఎస్ జగన్ యాత్ర @3000….

ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. తాజాగా ఈ యాత్ర లో భాగంగా వైస్ జగన్ 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12 వ జిల్లలో అడుగుపెట్టబోతున్నారు. ఈ యాత్ర ద్వారా ఇప్పటికే 2000 మైళ్ళ మైలు రాయిని అందుకున్నాడు. మరో రెండు రోజుల్లో 3000 మైళ్ళు పుర్తిచేసుకోనున్నారని బొత్స సత్యనారాయణ మీడియాతో వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా పుర్తిచేసుకుని విజయనగరం జిల్లాకు వస్తున్నారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జిల్లా వాసులు వైఎస్ జగన్ కోసం ఎదురుచుస్తున్నారని ఆయన తెలిపారు.

 

అనంతరం చంద్రబాబు పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలనను బాబు గాలికి వదిలేశారన్నారు. ఆయన  పాలన వల్ల రాష్ట్రము అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. జగన్ ది, చంద్రబాబు లాగా హైటెక్ యాత్ర కాదని, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేసే యాత్ర అని బొత్స  వెల్లడించారు. కాగా నేడు 267 వ రోజు విశాఖ జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat