కొండా సురేఖా దంపతులు కేసీఆర్ పై , టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ మండిపడ్డారు. పార్టీలో ఉన్నంత కాలం వారికి తాము మంచి వాళ్లమని, పార్టీ నుండి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు టీఆర్ఎస్ పై విమర్శలు చూస్తున్నారని విమర్శించారు.
ఎవరి ప్రజా బలమెంతో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు. విలువలు పట్టించుకోకుండా అధికారం కోసం కూటమి కడుతున్నారని మండిపడ్డారు. సీట్ల కోసం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూ పొర్లు దండాలు పెడుతున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్, టీడీపీ లు ఏ ఆలోచనతో పొత్తు పెట్టుకుంటున్నాయో ప్రజలకు చెప్పాలి అని కేటీఆర్ అన్నారు.