Home / CRIME / మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన

మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన

మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు . పీకల దాకా మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఈ వివరాలను చూస్తే, ముంబై, భయాండర్‌లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్ మహిళా పోలీసులకు వారు కనిపించారు. పైగా, ఆ నలుగురు అమ్మాయిలు ఒకరికొకరు గొడవ పడుతున్నారు.దీంతో పోలీసులు గొడవ పడుతున్న యువతులను అదుపు చేయబోయారు. కానీ, ఖాకీల మాటలేవి పట్టించుకోకుండా పోలీసులపై దాడికి దిగారు. లాఠీలను లాక్కోవడానికి ప్రయత్నించారు. మిగతా ఇద్దరు పోలీసుల షర్ట్ బటన్లు లాగుతూ.. వారి బ్యాడ్జీలను లాగేందుకు యత్నించారు. ఈ నలుగురు యువతులు.. పోలీసులను అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. మొత్తానికి నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ యువతి తప్పించుకుంది. మిగతా ముగ్గురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నలుగురు అమ్మాయిలను మమతా మెహార్(25), అలీషా పిైళ్లె(23), కమల్ శ్రీవాత్సవ(22), జెస్సీ డీ కోస్టా(22)లుగా గుర్తించారు. డీ కోస్టా పరారీలో ఉంది. ఈ అమ్మాయిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat