తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటా ముమ్మరంగా ప్రచారం చేస్తూ కారు గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా, ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు సాగాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని సూచిస్తున్నారు. కూటముల విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్ టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాశ్రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని సహా మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాశ్రెడ్డి తదితరులు హాజరయ్యారు.
వేలాదిగా వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా సమిష్టిగా అభ్యర్థి గెలుపుకోసం కృషిచేయాలని సూ చించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్నివర్గాలను అభివృద్ధి చేసిందని మంత్రి జోగు రామ న్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలువార్డు ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.