టీఆర్ఎస్ లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలో సప్పిడే సంజీవ్, తుమ్మిడే సురేష్ సహా 100మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టిఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప తన నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి (పరిగి) మహేశ్వర్ రెడ్డి సమక్షంలో గండీడ్ మండలం పెద్దవార్వాలుకు చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కొలుకొండ గ్రామం గౌడ సంఘానికి చెందిన 23 కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు గౌడ సంఘం సభ్యులు కన్నవిర సోమయ్య, కన్న యాదగిరి, కన్న రవి, భాషంపల్లి ఎల్లయ్య , జడలా యాకస్వామి, మాధపురం రమేష్ , బైరు సత్తయ్య , మెదరింటి పర్శరములు, పి.మల్లయ్య , కె.సత్తయ్య, పి. రాములు తదితరులకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రోజురోజుకు టీఆర్ఎస్ కు జన సంకల్పం ఎక్కువ అవుతుంది,దీంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు గురైయ్యారు.