Home / 18+ / దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చాలి…సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చాలి…సుప్రీంకోర్టు స్పష్టీకరణ

పటాకుల వినియోగం, విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. వాటి వినియోగాన్ని నిషేధించలేమని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశవ్యాప్తంగా రాత్రి రెండుగంటలు మాత్రమే పటాకులు కాల్చాలని స్పష్టంచేసింది. అన్ని మతాల పండుగలకు, శుభకార్యాలకూ తమ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలప్పుడు అర్ధరాత్రి వేళ 35నిమిషాలపాటు పటాకులు పేల్చేందుకు అనుమతినిచ్చింది. ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకాలపై నిషేధం విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. అతితక్కువ కాలుష్యాన్ని వెలువరించే పర్యావరణహిత పటాకులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.పర్యావరణం, ప్రజారోగ్య ం దృష్ట్యా.. దేశవ్యాప్తంగా పటాకుల తయారీ, వాటి విచ్చలవిడి వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది దేశరాజధాని కాలుష్యంతో తల్లడిల్లిన నేపథ్యంలో.. ఢిల్లీ చిన్నారులు అర్జున్ గోపాల్(3), ఆరవ్ భండారి(3), జోయారావ్ భాసిన్(5), వారి తల్లిదండ్రులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్‌భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ ఏడాది ఆగస్టు 28న పిటిషన్లపై విచారణను పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. దీపావళి సమీపిస్తుండటంతో మంగళవారం తీర్పును వెలువరించింది. పటాకులపై దేశవ్యాప్త నిషేధం సాధ్యంకాదని స్పష్టంచేసిన న్యాయస్థానం.. వాటి అమ్మకాలపై, వినియోగంపై మాత్రం షరతులు విధించింది. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే, పర్యావరణానికి హాని కలిగించని పటాకులను మాత్రమే విక్రయించాలని పేర్కొన్నది. వీటి ధ్వని కూడా తక్కువ మోతాదులో ఉండేలా చూడాలని సూచించింది. క్యాన్సర్ ఇతర అనారోగ్యాలకు దారితీసే కాపర్ సమ్మేళనాలను, హానికారక యాంటిమొనీ సల్ఫైడ్‌ను పటాకుల తయారీలో వాడరాదని తేల్చిచెప్పింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ పోర్టల్స్ ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకాలను నిర్వహించిరాదని ఆదేశించిన న్యాయస్థానం.. తమ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. లైసెన్సు కలిగిన దుకాణాలు మాత్రమే వాటిని విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఎక్కడైనా నిషేధిత పటాకులను విక్రయించినట్లు తేలితే ఆ ప్రాంత పోలీస్ అధికారులను బాధ్యులను చేస్తామని స్పష్టంచేసింది.

దీపావళినాడు రాత్రి 8గంటల నుంచి 10గంటల మధ్య మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 11.55 నుంచి అర్ధరాత్రి 12.30 వరకు 35నిమిషాలపాటు పటాకులు కాల్చుకోవచ్చునని స్పష్టంచేసింది. ఎన్సీఆర్-ఢిల్లీ పరిధిలో.. ఎవరికివారు వ్యక్తిగతంగా కాకుండా, బృందాల (కమ్యూనిటీల)వారీగా పటాకులు పేల్చడాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వానికి ద్విసభ్య ధర్మాసనం సూచించింది. ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. దేశరాజధాని (ఎన్సీఆర్) పరిధిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన నివాస సముదాయాల్లోనే పటాకులు కాల్చాలని, దీపావళికి ఏడు రోజుల ముందు నుంచి పండుగ తర్వాత ఏడు రోజుల వరకు గాలినాణ్యత ఎలా ఉందో ఎప్పటికప్పుడు కేంద్ర కాలుష్యమండలి పరిశీలించాలని న్యాయస్థానం పేర్కొన్నది. బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat