ముఖ్యమంత్రి కేసీఆర్తో నడిస్తే పొలాలకు సాగునీళ్లు అందుతాయని, చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఆంధ్రపాలకుల పల్లకీలు మోస్తున్నారని, నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి, నల్లారి కిరణ్కుమార్రెడ్డిలను మోసినవాళ్లు.. నేడు చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరందించి పాలమూరును పచ్చగా మార్చిందని చెప్పారు. తెలంగాణభవన్లో శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేటకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు, ముదిరాజ్, మత్స్యకార సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏండ్లుగా తెలంగాణను వంచిస్తూ.. సంపదను దోచుకుపోయిన వలస పాలకులను తరిమికొట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు కాంగ్రెసోళ్లు ఆ దొంగలకు సదులు ్దమోస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పక్కా ఆంధ్రాపార్టీ అని, అది తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తున్నదని అన్నారు.
70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరు జిల్లాలో లక్షన్నర ఎకరాలకు మాత్రమే సాగునీరిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలోనే ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిందని, పాలమూరు పచ్చబడి వలసబోయిన కూలీలంతా వాపస్ వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని హరీశ్రావు తెలిపారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రానికల్లా వైఎస్ రాజశేఖర్రెడ్డి మాటమార్చి.. తెలంగాణకు, హైదరాబాద్కు పోవాలంటే వీసాలు, పాస్పోర్టులు కావాలా? అని రెచ్చగొట్టినప్పుడు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు పౌరుషం లేకుండా ఆయన పల్లకీ మోశారని.. ఒక్క చిత్తూరు జిల్లా తాగునీటి కోసం రూ.7వేల కోట్లు కేటాయించి, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అసెం బ్లీ సాక్షిగా విర్రవీగిన నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వెనుక చేరి బల్లలు చరుస్తూ, కేరింతలు కొడు తూ పదవుల కోసం ఆయన పల్లకీ మోశారని, ఇప్పు డు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టుల మోటర్లను బంద్పెట్టాలని కేంద్రానికి ఫిర్యాదు చేసి పాలమూరు ప్రజల పొట్టకొట్టాలని కుట్రలు చేస్తున్న చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని మండిపడ్డారు.
ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో టీడీపీ చేరి రెండు మంత్రి పదవులు తీసుకోవాలని అనుకుంటున్నారని, వాటిలో ఓటుకు నోటు కేసును ఎత్తివేయించుకునేందుకు హోం ఒకటి కాగా, రెండోది తెలంగాణ పంట భూ ములను ఎండబెడుతూ కృష్ణా, గోదావరి జలాలలను సీమాంధ్రకు తరలించుకుపోయేందుకు నీటిపారుదలశాఖ తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. నాలుగు సీట్ల కోసం అవకాశవాద పొత్తులు పెట్టుకున్న కాం గ్రెస్, టీడీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజమంతా ఏకమై అభివృద్ధిని గెలిపించి, అవకాశవాదాన్ని ఓడించాలన్నారు. కాం గ్రెస్ నేతలు మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారని, బతుకమ్మ చీరెలు పంచకుండా అడ్డుకున్నారని అన్నారు.