ఓటమి భయంతోనో, తెలంగాణలో ఎక్కడికక్కడ కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతతోనో కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశిస్తున్న పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వాట్సాప్ పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. బీసీలను, ముదిరాజ్ లను ఉద్దేశించి రోహిత్ రెడ్డి తీవ్రమైన భాషతో దూషించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “తాండూర్ మన అడ్డా.. బీసీలను, మహేందర్ రెడ్డిని తరిమికొడదాం” అంటూ రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు వివాస్పదంగా మారాయి. ఈమేరకు ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డితోపాటు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించేవాళ్లు చాలామంది ఉన్నారు. అయినా రోహిత్ ప్రచారం చేస్తూ వివాదాలకు దిగుతున్నాడు.
ఇందులో భాగంగా యంగ్ లీడర్స్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో బీసీలను తప్పుగా మాట్లాడారు. ఈ స్క్రీన్ షాట్స్ చాటింగ్ వివరాలు రూపంలో బయటకు వచ్చాయి. అయితే తాండూరు లో అధిక శాతం బీసీలు ఉండడం.. ఇటువంటి చాటింగ్ బయట పడడంతో బీసీ సంఘాలు మీడియా ముందుకు వచ్చి రోహిత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి కుల పిచ్చి ఉన్న వ్యక్తికి ఓటు వేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరైనా సరే ఆ పార్టీకి ఓటు వేయొద్దని మండిపడ్డారు. బీసీలను కించపరిచేలా మాట్లాడిన రోహిత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. మొత్తమ్మీద తాండూరు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై బీసీలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.