మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే ఇక్కడ పార్టీని ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయి ఎందుకంటే నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది,ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారు.
మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజ్ గెలుపే ధ్యేయంగా నాయకులు,కార్యకర్తలు పనిచేస్తున్నారు.మండల పరిధిలోని ప్రతీ గ్రామానికి వెళ్లి లింగాల కమల్రాజ్ కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి సంక్షేమ పథకాలను వివరిస్తూ కేసీఆర్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ టీఆర్ఎస్ కారుగుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.అయితే ఇక్కడ కాంగ్రెస్,టీడీపీ తరుపున కూడా గట్టి పోటి ఇచ్చే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నపటికీ కాంగ్రెస్,టీడీపీ లను మళ్ళి నమ్మి మోసపోమని అక్కడ ప్రజలు చెప్తున్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క 2014లో గెలిచిన ఆయన చేసిన అభివృధి ఏమి లేదని అక్కడ ప్రజలు వాపోతున్నారు.