రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా పోరాడి సాధించారు. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేసారు. అయితే ఇటీవల ఆపరేషన్ చేయించుకోవడంతో నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.
మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు రానుండడం.. ప్రత్యర్ధ పార్టీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ బలమైన అభ్యర్ధి కావడంతో ప్రణయ్ తండ్రి బాధ్యతను తనపై వేసుకున్నాడు.. విశ్వన్నను బలపరుద్దాం.. కుటిల రాజకీయాలకు స్వస్థి చెపుదామంటూ రావాలి జగన్ – కావాలి జగన్ పాదయాత్రకు పేరుతో జగన్ స్పూర్తితో శ్రీకారం చుట్టాడు. జగనన్నను ముఖ్యమంత్రిని చేయడం, ప్రజలకు సుపరిపాలన అందిద్దాం అంటూ నియోజకవర్గంలోని ప్రతీ గడపకూ వెళ్తున్నాడు ప్రణయ్ రెడ్డి. ఈ పాదయాత్రకు ప్రజలు, వైసీపీ అభిమానులు వెల్లువలా తరలివస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి బిడ్డను మనసారా ఆశీర్వదిస్తున్నారు.
విశ్వేశ్వర రెడ్డి ఆరోగ్యం సమస్య ఉండడం వలన ఈ బృహత్తర కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై వేసుకొని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణలకు నేనున్నానని భరోసా ఇస్తున్న ప్రణయ్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. యువకుడు కావడంతో నియోజకవర్గంలో కొత్త రక్తం ఉరకలెత్తుతోంది. ప్రణయ్ కూడా సాధారణ వ్యక్తి మాదిరిగా ప్రజల్లో కలిసి తిరుగుతున్నాడు. తనకు అభిమానులెవ్వరూ లేరని, అందరూ తన అన్నదమ్ములని చెప్తున్నాడు. తనకంటూ అభిమానులు ఉండరని అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించాలని చెప్తున్నాడు. నాకంటే పెద్దలు తమ్ముడు అన్నా తనకు ఇష్టమేనంటూ ప్రణయ్ ప్రజలతో మమేకమవుతున్నారు. మనకు అభివృద్ధే ముఖ్యమని ముందుకెళ్తున్నారు. యువకుడిగా నిత్యం ప్రజల్లో ఉండే ప్రణయ్ కు నియోజకవర్గంపై పట్టు వచ్చింది. బలమైన అధికార పార్టీ, బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు వస్తున్న యువ నాయకుడికి ఉరవకొండ ప్రజలు మద్దతిచ్చి ఆశీర్వదిస్తున్నారు.