Home / SLIDER / సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!

సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!

తెలగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నెల ఏడో తారిఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారిఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరించనున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన నూట ఏడు మంది అభ్యర్థులకు రేపు ఆదివారం సాయంత్రం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బీఫారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి ఎన్నికల బరిలోకి దిగడానికి నామినేషన్ వేసే తేదిని ప్రకటించారు.దీంతోగజ్వేల్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన నామినేషన్‌ను గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో సమర్పించనున్నట్టు సమాచారం. నామినేషన్ దాఖలు తరువాత సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్టు, సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయని తెలుస్తుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat