కాంగ్రెస్తో దోస్తీ అంటే ఎలా ఉంటుందో…టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మెళ్లిమెళ్లిగా తెలుస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమను లైట్ తీసుకుంటుందనే విషయాన్ని పరోక్షంగా ఆయనే తెలియజెప్పారు. కూటమిలో సీట్ల కేటాయింపు జాప్యం జరుగుతుండటంపై కోదండరాం స్పందిస్తూ ఎన్నికల కీలక సంధర్భంలో సీట్లపై తేల్చడం కుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సిందని అయితే, కూటమిలో ప్రధాన పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
సీట్లసర్దుబాట్లుపై రోడ్ మ్యాప్ లేనందునే అనిశ్చితి ఏర్పడిందని కోదండరాం పేర్కొంటూ ఈ ప్రక్రియపై సోషల్ మీడియాలో తమపైన జోకులు వేస్తున్నారని వాపోయారు. సీట్లు ఎప్పుడు.. ఎజెండా ఎప్పుడు చెప్తారో అన్న గందరగోళంలో ఉందని వాపోయారు. కూటమి అంటేనే వ్యంగ్యంగా షోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. ఒకటి రెండురోజుల్లో సర్దుబాట్లు పూర్తి చేస్తాం అనుకుంటున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.