తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11వ తేదీన ఫలితాల ప్రకటన రానున్న సంగతి తెలిసిందే. దీనితో విరాళాలు ఎంత అందాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేశాయి. ఫారం 24 ఏ ప్రకారం ఎవరెంత విరాళమిచ్చారో పేర్కొంటూ ఆయా పార్టీల కార్యదర్శుల పేరిట విరాళాల లెక్కలని తెలియచేశారు. కాగా, ఈ జాబితాలో కాంగ్రెస్ టాప్లో నిలిచింది. కాంగ్రెస్కు రూ. 26 కోట్ల 65 లక్షల విరాళాలు వచ్చాయి. టీఆర్ఎస్కు రూ. 19 కోట్ల 41 లక్షల విరాళాలు, వైసీపీకి రూ. 8 కోట్ల 35 లక్షలు, టీటీడీపీకి రూ. 1 కోటి 73 లక్షలు విరాళాలు వచ్చాయి.
వివిధ వ్యక్తులు..సంస్థలు ఇచ్చిన విరాళాలు రూ. 19 కోట్ల 41 లక్షలు అని టీఆర్ఎస్ వెల్లడించింది. 2018 ఏప్రిల్ నుండి జులై వరకు విరాళాలు. పార్టీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ పేరిట ఎన్నికల సంఘానికి వివరాలు. రాఘవ కన్ స్ట్రక్షన్స్, శ్రీ వెంకటేశ్వర ఎంటర్ ప్రైజెస్ రూ. 2 కోట్లు..మల్లారెడ్డి, హోటల్ పార్క్ కాంటినెంటల్ ఏరో స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్..టి.భాను ప్రసాద్ రూ. కోటి చొప్పున విరాళాలు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరెస్ట్ ఇన్ ఫ్రా వెంచర్స్ ఇండియా…శ్రీ కాకతీయ ఇండస్ట్రీస్ రూ. 50 లక్షల చొప్పున విరాళాలు అందచేశాయని పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీకి రూ. 26 కోట్ల 65 లక్షల విరాళాలు. 2017-18లో సెప్టెంబర్ 28 వరకు విరాళాలు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్ పేరిట వివరాలు అందజేత. దేశంలోని ప్రముఖ సంస్థళు..మాజీ మంత్రులు..ఎంపీలు..ప్రైవేటు వ్యక్తులు విరాళాలు అందచేశారని..ఆదాయ పన్ను చట్టానికి లోబడి విరాళాలు స్వీకరించామని పేర్కొంది.