తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజా ఎన్నికలనుద్దేశించి చేసిన ఓ రాజకీయ విమర్శ ప్రత్యర్ధ గుంపు పార్టీల గుండెల్లో ఎంత భయాన్ని పుట్టించాయో, ప్రజల్లో ఆయన చేసిన ఓ విమర్శపై ఎంతటి చర్చ నడిచిందో.. ఆ చర్చ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలుసుకోవాడానికి తెలంగాణ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ.
ముఖ్యంగా తమ గెలుపు మీద నమ్మకం లేక ఆంధ్రానుండి నుండి కాంగ్రెసోళ్లు చంద్రబాబును భుజాలమీద మోసుకొస్తున్నారు.. తెలవిగా ఆలోచించండి.. మళ్లీ తెలంగాణాను బానిసను చేస్తారు. అంటూ కేసీఆర్ చేసిన ఈ విమర్శకు యావత్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీల వద్ద విరుగుడు లేకపోయింది.
కేవలం ఈ ఒక్క విమర్శే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పేలా చేసింది. కానీ ఈ విమర్శలతోనే కేసీఆర్ గెలవలేదు. ఎన్నో కుట్రలను ఎదురించారు. కుతంత్రాలను అధిగమించారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, ప్రజల కళ్లారా చూసిన అభివృద్ధి టీఆర్ఎస్ కు పట్టం కట్టాయని చెప్పుకోవచ్చు. మొత్తమ్మీద రాజకీయాల్లో హత్యలుండవు..కేవలం ఆత్మహత్యలే అనేదానికి 100 సంవత్సరాలకు పైబడిన చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ ఒక ఉదాహరణ.. కచ్చితంగా కాంగ్రెస్ పాల్పడింది మరో రాజకీయ ఆత్మహత్యకే అని మాత్రం చెప్పగలం.