బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్పై భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి.కడవరకూ పోరాడిన టీమిండియా.. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. గత 11 ఏళ్లలో ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
చివరిసారిగా 2008లో పెర్త్లో ఆసీస్పై విజయం సాధించింది. ఆసీస్ పర్యటనలో సిరీస్లో తొలి టెస్టు గెలవడం భారత్కు ఇదే తొలిసారి.అలాగే ఆ జట్టుతో ఆడిన చివరి 45 టెస్టుల్లో భారత్కు ఇది ఆరో విజయం మాత్రమే. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటికీ టీమిండియా ఒక్క టెస్టు కూడా గెలవకపోవడం గమనార్హం. ఈ విజయం పట్ల అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. తొలి టెస్టులో గెలుపొందిన సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.