ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఏదో ఒక రకమైన వేధింపులు మానడంలేదు. చంద్రగిరి మండలం లోని అక్కగారి కాలనీలో నీలిమ 20సంవత్సరాలు అనే మహిళ సోమవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పెద్ద కుమార్తె నీలిమ కొత్త చానా బట్టల గ్రామానికి చెందిన వెంకటరత్నం రెడ్డి కుమారుడు మునిరెడ్డి కి ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేయించాడు కట్నంగా 70 వేల రూపాయల నగదు 15 సవరాలు బంగారు ఆభరణాలు పెట్టినట్లు తెలిపారు.
పెళ్లి అయిన ఆరు నెలల వరకు వారి కాపురం సజావుగా జరిగిందని ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ప్రణీత్ జాహ్నవి ఉన్నట్లు తెలిపారు. 6 నెలల తర్వాత నుండి అత్తింటి వారి నుండి వరకట్న వేధింపులు ప్రారంభమయినట్లు తెలిపారు. పెద్దమనుషులతో చేసినప్పటికీ అత్తవారింటి నుండి మార్పు రాలేదు మనస్తాపానికి గురై నీలిమ సోమవారం ఉదయం క్రిమిసంహారక మందులు తీసుకొంది. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు తన తండ్రికి ఫోన్ చేసి తెలిపారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే తన కుమార్తె చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని. తన కుమార్తె మృతికి భర్త మునిరెడ్డి మామ వెంకటరత్నం రెడ్డి అత్త అమ్ములు వేధింపుల కారణంగానే నీలిమ చనిపోయినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాన్ని తిరుపతి వైద్యకళాశాలకు తరలించారు కేసు నమోదు చేసి చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా మహిళలు చనిపోవడం, అందులోనూ వరకట్నం కోసం చనిపోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది.