గులాబీ దళపతి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు చేసారు.తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పండితులతో చర్చల అనంతరం…. గురువారం ఉదయం సుబ్రమణ్య షష్ఠి మంచి ముహూర్తమేనని అనడంతో రేపు మధ్యాహ్నం 1.30కు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల అనంతరం దేశరాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానన్న కేసీఆర్.. ప్రమాణస్వీకారంతోనే కార్యచరణ మొదలు పెట్టాలని తొలుత భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండటం.. సన్నిహిత నేతలు వారి పనుల్లో బిజీగా ఉండటంతో తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్తో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.