శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్జెండర్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్జెండర్లకు అనుమతి లభించింది. ఇవాళ వాళ్లు స్వామిని దర్శించుకున్ని మొక్కులు చెల్లించుకున్నారు. నల్ల చీరలు ధరించి, ఇరుముడితో వచ్చిన నలుగురు ట్రాన్స్జెండర్లకు పోలీసులు భద్రత కల్పించారు. నీలక్కల్ నుంచి పంబ వరకు, ఆ తర్వాత కొండ ఎక్కుతున్న సమయంలో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. పవిత్రమైన18 మెట్లను కూడా వాళ్లు ఎక్కారు.ఈ నలుగురు అనన్య, తృప్తి, రెంజుమోల్, అవంతికలుగా గుర్తించారు.